ETV Bharat / state

కలెక్టరేట్‌ను ముట్టడించిన కాంగ్రెస్...అడ్డుకున్న పోలీసులు

author img

By

Published : Nov 12, 2020, 5:56 PM IST

Congress dharna in rajanna siricilla dist police stopped at collectorate office
కలెక్టరేట్‌ను ముట్టడించిన కాంగ్రెస్...అడ్డుకున్న పోలీసులు

సన్నవరికి మద్దతు ధర ప్రకటించాలంటూ కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు నిరసనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించేవరకు తమ పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పోలీసులకు, కాంగ్రెస్ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. సన్నవరికి మద్దతు ధర చెల్లించాలని కోరుతూ కలెక్టరేట్ ముట్టడికి యత్నంచిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి క్వింటాలుకు రూ.2500 మద్దతు ధర ప్రకటించాలని కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు.

ప్రభుత్వ ఆదేశాలతో సన్నవరి ధాన్యం పండించిన రైతులు తీవ్రంగా నష్టపోయారని...ఎకరాకు రూ.20 వేల పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. రైతుల పక్షాన పోరాడుతున్న తమపై పోలీసులు, అధికారులు దురుసుగా ప్రవర్తించడాన్ని కాంగ్రెస్ నాయకులు తప్పుబట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, ఆది శ్రీనివాస్, సంగీతం శ్రీనివాసులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:టోకెన్లు ఇవ్వడం లేదంటూ మిర్యాలగూడలో రైతుల ధర్నా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.