BANDI SANJAY: 'దీపావళి లోపల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుంటే.. మిలియన్​ మార్చ్​ నిర్వహిస్తాం'

author img

By

Published : Sep 26, 2021, 6:23 AM IST

BANDI SANJAY

దీపావళి లోపు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని లేకుంటే హైదరాబాద్​లో నిరుద్యోగులతో మిలియన్​ మార్చ్​ నిర్వహిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన డెడ్​లైన్​ విధించారు. తెరాస ప్రభుత్వంపై ఆఖరి పోరాటానికి భాజపా సిద్ధమైందన్న సంజయ్​.. నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

BANDI SANJAY: 'దీపావళి లోపల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుంటే.. మిలియన్​ మార్చ్​ నిర్వహిస్తాం'

రాష్ట్రంలో నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని.. తెరాస ప్రభుత్వంపై భాజపా ఆఖరి పోరాటానికి సిద్ధమైందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వానికి బండి సంజయ్​ డెడ్​లైన్​ విధించారు. దీపావళి నాటికి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటికీ నోటిఫికేషన్లు ఇవ్వాలని లేకుంటే నిరుద్యోగులతో హైదరాబాద్​లో మిలియన్​ మార్చి నిర్వహిస్తామని సంజయ్ స్పష్టం చేశారు. మిలియన్​ మార్చ్​తో తెరాస ప్రభుత్వం కూలడం ఖాయమన్నారు.

తెలంగాణలో మార్పు కోసం చేపట్టిన ప్రజాసంగ్రామయాత్ర.. మహాసంగ్రామ యాత్రగా మారిందని బండి సంజయ్​ పేర్కొన్నారు. ప్రజాసంగ్రామయాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ అంకిరెడ్డిపల్లెలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు.

ప్రపంచమంతా మోదీ మోదీ అని.. దేశమంతా యోగి యోగి అని.. అంటున్నారన్న సంజయ్​.. తెలంగాణలో మాత్రం రోగి రోగి అని నినదిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉపఎన్నికలు వస్తుంటే.. రేపే ఉద్యోగాల నోటిఫికేషన్​ అని హామీలిచ్చి.. ఎన్నికలయ్యాక ఫాంహౌస్​కెళ్లి పడుకుంటున్నారని విమర్శించారు. హుజూరాబాద్​ ఉపఎన్నికల్లో కర్రు కాల్చి వాతపెట్టడం ఖాయమని సంజయ్​ అన్నారు.

'ఇంటికో ఉద్యోగం ఏమైంది? డీఎస్సీ ఏమైంది? విద్యా వలంటీర్లను తొలగించిండ్రు. 7 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేశారు. విద్యావ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నరు. కోరుట్లలో స్కూల్​ మేనేజ్​మెంట్​ కమిటీ విద్యా వలంటీర్లను నియమిస్తే సంబంధిత ఎంఈవో, ప్రధానోపాధ్యాయులను సస్పెండ్ చేసిండ్రు. వాళ్లు చేసిన తప్పేంటి? తక్షణమే వారిని విధుల్లోకి తీసుకోవాలి. లేనిపక్షంలో భాజపా తడాఖా చూపిస్తాం.

బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు.

రైతుబంధు ఇచ్చి మిగిలిన అన్ని సబ్సిడీలు బంద్ చేశారని సంజయ్​ ఆరోపించారు. కేంద్ర నిధులను దారి మళ్లిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు బాధలు చెప్పుకుంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరి వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు.

కేసీఆర్ కారు వెనక్కిపోతోంది..

ప్రజాసమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా సంజయ్ పాదయాత్ర చేస్తూ బండి ముందుకు వెళుతుంటే.. కేసీఆర్ కారు వెనక్కిపోతోందని ఆ పార్టీ నేత విజయశాంతి ఎద్దేవా చేశారు. భాజపా పాదయాత్రతో ప్రజల్లో ఆశలు మొదలయ్యాయన్నారు. బండి సంజయ్ పాదయాత్రను తెరాస నేతలు విమర్శించడాన్ని తప్పుబట్టిన విజయశాంతి.. కేసీఆర్​ ఎలాగూ తిరగరని.. కనీసం ప్రజాసమస్యలు తెలుసుకొనేందుకు పాదయాత్ర చేస్తున్న సంజయ్​ను అభినందించాల్సి పోయి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఇదీచూడండి: EETELA ON KCR: 'అభివృద్ధి చేయకపోతే ఆరుసార్లు ఎలా గెలిచా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.