ETV Bharat / state

రాజన్న ఆలయంలో రూ.45 లక్షల లడ్డూ ప్రసాదాల సొమ్ము స్వాహా

author img

By

Published : Apr 29, 2021, 3:40 AM IST

Updated : Apr 29, 2021, 8:55 PM IST

లడ్డూ ప్రసాదాల సొమ్ము స్వాహా
లడ్డూ ప్రసాదాల సొమ్ము స్వాహా

రాజుల సొమ్ము రాళ్లపాలు అన్న చందంగా రాజన్న ప్రసాదాల సొమ్ము ఆలయ సిబ్బంది పాలౌతోంది. ప్రసాదం కౌంటర్​లో పనిచేసే రికార్డు అసిస్టెంట్​ ఏకంగా రూ.45 లక్షలను తన సొంతానికి వాడుకున్నాడు. ఉన్నతాధికారి పరిశీలనలో ఈ అక్రమ వ్యవహారం బయటపడటంతో గుట్టుచప్పుడు కాకుండా ఆ సొమ్ము తిరిగి చెల్లించినట్లు సమాచారం.

ప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతోన్న వేములవాడ రాజన్న ఆలయంలో అవినీతి వ్యవహారాలు తరచూ బయట పడుతూనే ఉన్నాయి. తాజాగా లడ్డూ ప్రసాదాల సొమ్ము రూ.45 లక్షలను రికార్డు అసిస్టెంట్​ తన సొంతానికి వాడుకున్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది.

ప్రతిరోజు ప్రసాదం పెద్ద ఎత్తున విక్రయం జరిగినప్పటికీ ప్రసాదం కౌంటర్​లో పని చేసే రికార్డు అసిస్టెంట్​ వెంకటేశ్​ తక్కువ అమ్మినట్లు లెక్కచూపుతూ.. ఆ సొమ్మును సొంతానికి వాడుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఇలా జరుగుతున్నప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విషయం ఆసక్తికరంగా మారింది. తాజాగా ఆలయ సూపరింటెండెంట్ ఒకరు ప్రసాద ఆదాయానికి సంబంధించిన వివరాలు తనిఖీ చేయడంతో ఈ అక్రమం వెలుగు చూసింది. ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారడంతో సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా ఆ సొమ్ము తిరిగి చెల్లించినట్లు సమాచారం.

ఈ విషయంపై ఆలయ ఈవో స్పందించారు. ప్రసాదాల కౌంటర్‌లో సొమ్ము సొంతానికి వాడుకున్న విషయం నిజమేనని.. అతను తిరిగి డబ్బు చెల్లించాడని వివరించారు.

ఇదీ చూడండి: లాక్​డౌన్​పై వస్తోన్న వార్తలన్నీ అవాస్తవం: డా.శ్రీనివాస్

Last Updated :Apr 29, 2021, 8:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.