ETV Bharat / state

గాంధీ జయంతి సందర్భంగా స్వేరోస్,​ ఫిట్​ ఇండియా ఆధ్వర్యంలో 2కే రన్​

author img

By

Published : Oct 2, 2020, 5:42 PM IST

sweros and fit india organized 2k run in peddapally district
గాంధీ జయంతి సందర్భంగా స్వేరోస్,​ ఫిట్​ ఇండియా ఆధ్వర్యంలో 2కే రన్​

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి జిల్లా పరిషత్ ఛైర్మన్​ పుట్ట మధుకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వేరోస్, ఫిట్ ఇండియా ఆధ్వర్యంలో 2కే రన్​ నిర్వహించారు.

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్ట మధుకర్ పూలమాలవేసి నివాళులర్పించారు. స్వేరోస్, ఫిట్ ఇండియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 2కే రన్​ని ఛైర్మన్​ జెండా ఊపి ప్రారంభించారు.

2కే రన్​ ముఖ్య ఉద్దేశం అందరూ ఆరోగ్యంగా ఉండాలనీ.. ప్రతి ఒక్కరూ శారీరకంగా దృఢంగా ఉంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవని తెలపడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.

మంథని సీఐ మహేందర్, విద్యార్థులు, ప్రజలు ఈ రన్​లో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఇదీ చదవండి: కరోనాను ఎదుర్కోవడమే మహాత్మునికి ఇచ్చే నిజమైన నివాళి: కిషన్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.