ETV Bharat / state

'చమురు ధరలను వెంటనే తగ్గించాలి'

author img

By

Published : Jun 29, 2020, 4:12 PM IST

mla sridhar babu demand reduced oil prices immediately
'చమురు ధరలను వెంటనే తగ్గించాలి'

చమురు ధరల పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్​ నేతలు పెద్దపల్లిలో ఆందోళనకు దిగారు. వెంటనే ధరలను తగ్గించాలని డిమాండ్​ చేశారు. జిల్లా అదనపు కలెక్టర్​కు వినతి పత్రం అందజేసి సమస్యలను వివరించారు.

వరుస చమురు ధరల పెంపును నిరసిస్తూ పెద్దపెల్లిలో కాంగ్రెస్ నేతలు ఆందోళన నిర్వహించారు. ఈమేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమురయ్య, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో కలెక్టరేట్​ వద్ద నిరసన తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదనపు కలెక్టర్​కు వినతి పత్రం అందజేసి సమస్యలను వివరించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు ఎమ్మెల్యే అధికారులకు తెలిపారు.

ఇదీ చూడండి : 'తప్పు చేస్తే సొంత పార్టీ వారైనా చర్యలు తప్పవు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.