ETV Bharat / state

కత్తులతో యువకుడి దారుణ హత్య

author img

By

Published : Nov 16, 2019, 9:53 AM IST

ఇంట్లో ఒంటరిగా ఉన్న యువకునిపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. కిరాతకంగా చంపేసి... రోడ్డుపై పడేసి పారిపోయారు. ఈ ఘటన నిజామాబాద్​లో జరిగింది.

YOUNG MAN BRUTALLY MURDERED AT NIZAMABAD

నిజామాబాద్​లో యువకుని హత్య కలకలం రేపుతోంది. పులాంగ్ చౌరస్తాలోని గోనె రెడ్డి కల్యాణ మండపం వద్ద 28ఏళ్ల అబ్దుల్​ ఫిరోజ్​ని గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. ఫిరోజ్​ ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన దుండగులు కత్తులతో దాడి చేశారు. ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి రోడ్డుపై పడేసి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఘటన స్థలంలో క్లూస్ టీం,డాగ్​స్క్వాడ్​తో దర్యాప్తు చేస్తున్నారు.

కత్తులతో యువకుడి దారుణ హత్య

ఇవీచూడండి: రైలు కిందపడి యువకుడి ఆత్మహత్యాయత్నం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.