నిజామాబాద్ భాజపా ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాను జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నారాయణ ఎగురవేశారు.. అనంతరం సాయుధ పోరులో అమరులైన వీరులకు నివాళులర్పించారు.
నిరంతరం ఉద్యమిస్తాం..
సమర యోధులను కీర్తించి సన్మానించారు. ప్రభుత్వమే అధికారికంగా విమోచన దినోత్స వాన్ని నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించే వరకు ప్రభుత్వంతో తమ పార్టీ నిరంతరం ఉద్యమిస్తుందన్నారు.
ఇవీ చూడండి : వారి సేవలు ఎనలేనివి... ప్రమోట్ చేయండి: మంత్రి ఈటల