ETV Bharat / state

TU Students Problems : వర్సిటీ ఏర్పాటై పదహారేళ్లు అయినా... అభివృద్ధికి మాత్రం దూరం

author img

By

Published : Jul 18, 2023, 8:22 AM IST

Telangana University
Telangana University

Telangana University Problems : తెలంగాణ యూనివర్సిటీకి నూతనంగా నియామకమైన ఇన్‌ఛార్జ్ వీసీకి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. వర్సిటీ ఏర్పాటై పదహారేళ్లు గడుస్తున్నా సమస్యలు, వివాదాల నుంచి మాత్రం బయట పడటం లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ ప్రాంత విద్యార్థుల కోసం ఏర్పాటైన ఈ యూనివర్సిటీ.. పేరుకే పరిమితమైంది. నిత్యం ఏదో ఒక వివాదంతో నానుతూనే ఉండటం తప్ప.. వర్సిటీ గురించి మరేమీ వినిపించని పరిస్థితి నెలకొంది. వర్సిటీ విద్యార్థుల సమస్యలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

వర్సిటీ ఏర్పాటై పదహారేళ్లు అయినా... నోచుకోని అభివృద్ధి

Telangana University Issues : 2006లో ఏర్పాటైన తెలంగాణ విశ్వవిద్యాలయం.. మొదట ఆరు కోర్సులతో గిరిరాజ్‌ కళాశాలలో ప్రారంభించి.. 2009లో డిచ్‌పల్లి మండలంలోని నడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో జాతీయ రహదారి పక్కన క్యాంపస్‌గా మార్చారు. నేటికీ కోర్సులకు అవసరమైన భవనాలు, వసతి గృహాలు పూర్తి కాలేదు. ఉన్న భవనాలలోనే తరగతులు, వసతి గృహాలను నిర్వహిస్తున్నారు. అధ్యాపకులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిపోతుండటం వల్ల విద్యార్థులు ఎంచుకున్న కోర్సుల్లో ఉత్తీర్ణత సాధిస్తున్నా.. పోటీ పరీక్షల్లో రాణించలేకపోతున్నారు. పరిశోధనలకు విశ్వవిద్యాలయం పరిధిలో అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల ఇప్పటికీ యూజీసీ నుంచి ఎక్కువగా నిధులు రావడంలేదు. వర్సిటీలో ప్రాంగాణ ఎంపికలు లేక పీజీ, డిగ్రీల పట్టాలతో బయటకు వెళ్తున్న విద్యార్థులు, వర్సటీలో ప్లేస్​మెంట్​ లేక ఉపాధి కోసం వెతుకులాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

TU Students Problems : వర్సిటీలో ఇప్పటికీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ స్థాయిలో అన్ని డిపార్టుమెంట్లలో భారీగా ఖాళీలు ఉన్నాయి. వీటిని రెగ్యులర్‌ ప్రాతిపదికన భర్తీ చేయకపోవడం వల్ల అకాడమిక్‌ కన్సల్టెంట్లను తీసుకుని తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రెగ్యులర్‌ ప్రొఫెసర్లు సగం మంది స్థానికంగా ఉన్నా.. మిగతావారందరూ హైదరాబాద్‌ నుంచి వచ్చిపోవడంతో పాలన గాడి తప్పుతోంది.

''మా యునివర్సిటీలో సరిపడ సిబ్బంది లేరు, లాబ్స్​ లేవు, జర్నలిజం విద్యార్థులకు స్టుడియో లేదు ఇలా ఏ వసతి లేకపోవడం వల్ల ప్రాక్టికల్​గా నేర్చుకోలేపోతున్నాం. అబ్బాయిలకు రెండు హాస్టల్స్ ఉంటే అమ్మాయిలకు ఒకే వసతి గృహం ఉంది ఒక్కో గదిలో 10 నుంచి 12మంది ఉంటున్నారు. అడవి ప్రాంతం కాబట్టి పాములు, అడవి పందులు తిగుతున్నాయి ఎవరికైనా ఏమైనా అయితే వారిని తీసుకెళ్లడానికి సరిగ్గ అంబులెన్స్​ లేదు ఇప్పుడైనా ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు తీర్చాలని కోరుకుంటున్నాం." - విద్యార్థులు

ఇప్పుడైనా సమస్యలు తీర్చండి: నూతనంగా ఇన్‌ఛార్జ్‌ వీసీ బాధ్యతలు తీసుకున్న వెంటనే ప్రొఫెసర్ల గ్రూపు రాజకీయాలను అరికట్టాల్సిన అవస్యకత ఎంతైనా ఉంది. మహిళల వసతి గృహాల కోసం చర్యలు తీసుకోవాల్సి ఉంది. దాదాపు 350 మందికి పైగా మహిళలకు ఒకే హస్టల్​ ఉంది. రాత్రిళ్లు చదుకోవడానికి సరైనా స్టడీహాల్లు లేక అమ్మాయిలు ఇబ్బందులు పడుతున్నారు. లైబ్రరీలో పోటీ పరీక్షల కోసం పుస్తకాలను అందుబాటులోకి తేవాలి. యూనివర్సిటీలో అంబులెన్స్ సమస్య, ఒక్కటే అందుబాటులో ఉండడం వల్ల అత్యవసర సమయాల్లో వేరే వాహానాలను వెతుక్కోవాల్సి వస్తుంది. హెల్త్ సెంటర్ సమస్య పరిష్కరించాలి. ఉదయం డాక్టర్​ ఉంటున్న రాత్రిళ్లు ఉండటం లేదు.. ఈ సమయంలో ఎవరికైనా సమస్య వస్తే నిజామాబాద్​కి తీసుకెళ్లాలి. విద్యార్థులు శారీరకంగా మానసిక ఉల్లాసం కోసం వర్సిటీ మైదానం సిద్ధం చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

ఇప్పటికైనా వర్సిటీలో వివాదాలకు తెరదించి పరిపాలనను గాడిలో పెట్టాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇన్‌ఛార్జ్‌ వీసీ అయినా ఆ దిశగా దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.