నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎల్ఆర్ఎస్కు నిరసనగా ఆందోళనకు దిగారు.
ఎప్పుడో కొనుగోలు చేసిన, ఇదివరకే రిజిస్ట్రేషన్ పూర్తైన ప్లాట్లను ఈ పథకం నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ.. ఆర్డీఓ, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, సబ్ రిజిస్ట్రార్కు వినతి పత్రం సమర్పించారు.
- ఇదీ చదవండి: "నా సొరకాయలు పోయాయి సార్..!"