బాల్కొండ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఈరోజు నూతన పాలక వర్గం కొలుపుదీరింది. మెండోర మండలంలో జరిగిన అధ్యక్ష ప్రమాణస్వీకార కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. మండలంలోని పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ, తెరాస కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన నాయకులందరూ ప్రజల మనసును చూరగొనాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి సూచించారు.
ఇవీచూడండి: ఇంజినీర్పై మహా ఎమ్మెల్యే 'బురద దాడి'