ETV Bharat / state

MLC Kavitha Campaign in Nizamabad : "బీఆర్​ఎస్​ ప్రభుత్వం కాదు.. బీసీ ప్రభుత్వం"

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 10, 2023, 4:22 PM IST

MLC Kavitha Campaign in Nizamabad : బీఆర్ఎస్ హయాంలోనే కల్లుగీత కార్మికులకు న్యాయం జరిగిందని.. 70 వేల కుటుంబాలకు ఉపాధి కల్పించిన ఘనత కేసీఆర్​దేనని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్ గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కవిత... రేణుక ఎల్లమ్మ సమక్షంలో తన ఎన్నికల ప్రచార సభ ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు.

MLC kavitha Participating in Gouda atmiya Sabha
MLC kavitha Nizamabad Tour

MLC Kavitha Campaign in Nizamabad : రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్​ విడుదలయినందున.. రాజకీయ పార్టీలన్ని ప్రచారంలో సిద్ధమవుతున్నాయి. నిజామాబాద్​లో ఎమ్మెల్సీ కవిత ఎన్నికల ప్రచార సభ ప్రారంభించారు. గౌడ సంఘం(Gouda Atmiya Sabha) ఆధ్వర్యంలో నిజామాబాద్​ బీఆర్​ఎస్​ కార్యకర్తలు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. రేణుక ఎల్లమ్మ సమక్షంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్​ సమస్య నిజామ్​ కాలం నుంచి ఉందని.. మిషన్ భగీరథ పథకంతో ఆ సమస్యను కేసీఆర్ ప్రభుత్వం తగ్గించిందని గుర్తు చేశారు.

MLC Kavitha Reacts on Women Reservation Bill : మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ కవిత..

MLC kavitha Nizamabad Tour : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముందు పరిపాలించిన పార్టీలు మద్యం ఆదాయం గండిపడుతుందని.. నీరాని అంతగా ప్రోత్సహించలేదని కవిత ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడిన తరవాత కేసీఆర్​ హైదరాబాద్​లో నీరా షాపులు పెడతామని చెప్పి.. మాట నిలబెట్టుకున్నారని అన్నారు. దీనివల్ల 70 వేల కుటుంబాలకు ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని చెప్పారు. కులవృత్తి అభివృద్ధి కోసం కేసీఆర్​ కృషి చేస్తున్నారని తెలిపారు. మద్యం దుకాణాలు టెండరు నిర్వహిస్తే గౌడ కులస్థులకు 15 శాతం కేటాయించిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.

"ప్రతి కాల్వ మీద తాటి, ఈత చెట్టును పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్దార్‌ పాపన్న జయంతి ప్రభుత్వం అధికారికంగా చేయడానికి నిర్ణయించింది. బీఆర్​ఎస్ ప్రభుత్వం కాదు.. బీసీల ప్రభుత్వం."- కవిత, ఎమ్మెల్సీ

MLC Kavitha Participating in Gouda Atmiya Sabha : డిసెంబర్ 3న గెలిచేది బీఆర్​ఎస్​ పార్టీయే అని కవిత ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ పార్టీ 2014కి ముందు అనేక సార్లు అధికారంలోకి వచ్చిందని.. నిజామాబాద్​లో బీసీ హాస్టల్​ ఒకటి మాత్రమే కట్టించారని తెలిపారు. బీఆర్ఎస్​ వచ్చిన 10 ఏళ్లలో 15కు పెంచారని గుర్తు చేశారు. కల్యాణ లక్ష్మి పథకం(Kalyani Lakshmi Scheme) ద్వారా బీసీలకు ఎంతో మేలు జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్నది బీఆర్ఎస్​ ప్రభుత్వం కాదని.. బీసీల ప్రభుత్వమన్నారు. ఎన్నికల ప్రచారానికి ఇతర పార్టీలు వస్తాయని.. వారిని నిజామాబాద్​లో బీసీ హాస్టల్​ ఒకటే ఎందుకు కట్టారని ప్రశ్నించాలని ఆమె సూచించారు. నగరంలో రేణుక ఎల్లమ్మ ఆలయానికి రూ.75 లక్షలు కేటాయించామని.. 20 శాతం పరిహారం చెల్లించక ఆగిపోయిందని.. అది చెల్లించిన వెంటనే ఆ నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా పోటీ చేస్తున్న బీఆర్​ఎస్​ అభ్యర్థి గణేశ్​ గుప్తా పాల్గొన్నారు.

MLC Kavitha Campaign in Nizamabad "బీఆర్​ఎస్​ ప్రభుత్వం కాదు.. బీసీ ప్రభుత్వం"

Supreme Court on MLC Kavitha Petition : దిల్లీ లిక్కర్ స్కామ్.. ఎమ్మెల్సీ కవిత పిటిషన్​పై నవంబర్‌ 20న సుప్రీం విచారణ

MLC Kavitha on Rahul Gandhi Comments : సత్య దూరమైన మాటలు చెప్పడం రాహుల్‌ గాంధీకి అలవాటే: ఎమ్మెల్సీ కవిత

Kavitha Reaction on Women's Reservation Bill 2023 : మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. ఏమన్నారంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.