ETV Bharat / state

బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల పర్యటన

author img

By

Published : Jun 13, 2020, 12:38 PM IST

Minister Vemula prashanth reddy toured in Balkonda constituency
బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల పర్యటన

నిజామాబాద్​ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని పలు మండలాల్లో మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

నిజామాబాద్​ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూరు, భీమ్​​గల్​ మండలాల్లో రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కప్పలవాగుపై రూ. 14 కోట్ల 76 లక్షలతో నిర్మించనున్న 3 చెక్​డ్యాంలకు శంకుస్థాపన చేశారు.

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బాల్కొండ నియోజకవర్గానికి ఎక్కువ చెక్​డ్యాంలు మంజూరయ్యాయని మంత్రి పేర్కొన్నారు. భీమ్​గల్​, వేల్పూరు మండలాల్లోని పలు గ్రామాలు కరువుతో ఉన్నాయని.. వాటిని సస్యశ్యామలం చేసేందుకే ఈ చెక్​డ్యాంల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.

ప్రస్తుతం నియోజకవర్గానికి 19 చెక్​డ్యాంలు మంజూరయ్యాయని.. మరో 4 త్వరలోనే మంజూరవుతాయన్నారు. వీటి ద్వారా 33 గ్రామాల్లోని సుమారు 45 వేల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీచూడండి: ఈనెల 16న కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.