నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండలం నర్సాపూర్ గ్రామ పరిధిలోని సోమిర్యాగుడి తండాలో ఘోరం చోటు చేసుకుంది. ఆరుబయట నిద్రిస్తున్న అల్లుడిని మామ నరికి చంపాడు. గత కొద్ది రోజులుగా మామ పత్యా నాయక్, అల్లుడు శర్మ నాయక్ల కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
అల్లుడిపై కోపంతో ఆరుబయట నిద్రిస్తున్న శర్మ నాయక్ను పత్యా నాయక్ గొడ్డలితో నరికి చంపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: 80 రోజుల తర్వాత పెట్రోల్ ధరలు పెంపు