ETV Bharat / state

నిజమాబాద్​లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి

author img

By

Published : Oct 31, 2020, 7:09 PM IST

congress leaders condolences to former pm indira gandhi at nizamabad district
నిజమాబాద్​లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి

కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్​ కాంగ్రెస్​ భవన్​లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి నిర్వహించారు. ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్​ భవన్​లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతిని పార్టీ శ్రేణులు నిర్వహించారు. ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నగరంలోని పులాంగ్​ చౌరస్తాలోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేశారు.

దేశం కోసం, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆమె చేసిన సేవలను కాంగ్రెస్​ నాయకులు గుర్తుచేసుకున్నారు. దేశఖ్యాతిని నలుమూలల చాటిన గొప్ప వ్యక్తి ఇందిరాగాంధీ అని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ మైనార్టీ అధ్యక్షులు, హస్తం శ్రేణులు తదితరలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: వరద సాయం కోసం ఉప్పల్​లో బాధితుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.