నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిని కలెక్టర్ రామ్మోహన్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు విభాగాల్లోని సేవలు, వసతులును పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది హాజరుని తనిఖీ చేయగా... చాలా మంది విధులకు హాజరుకావడం లేదని గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు స్టాఫ్ నర్సులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రోగులకు ఇబ్బంది కాకుండా సమయపాలన పాటించాలని ఆదేశించారు. సదరం శిబిరంలో సర్టిఫికెట్లు జారీ చేయడం లేదని ఈ సందర్భంగా కలెక్టర్కు దివ్యాంగులు ఫిర్యాదు చేశారు.
- ఇదీ చూడండి : అక్రమ నల్లా కనెక్షన్ల క్రమబద్ధీకరణకు మరో అవకాశం