ETV Bharat / state

వైద్యశాఖలో నలుగురికి షోకాజ్ నోటీసులు

author img

By

Published : Nov 23, 2019, 7:55 PM IST

ప్రభుత్వాసుపత్రి సిబ్బందిపై కలెక్టర్ సీరియస్​

నిజామాబాద్ ఆసుపత్రిలో పనిచేస్తున్న నలుగురు సిబ్బందికి కలెక్టర్ షోకాజ్​ నోటీసులు జారీ చేశారు. ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన... చాలా మంది విధులకు డుమ్మా కొడుతున్నట్లు గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిని కలెక్టర్ రామ్మోహన్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు విభాగాల్లోని సేవలు, వసతులును పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది హాజరుని తనిఖీ చేయగా... చాలా మంది విధులకు హాజరుకావడం లేదని గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు స్టాఫ్​ నర్సులకు షోకాజ్​ నోటీసులు జారీ చేశారు. రోగులకు ఇబ్బంది కాకుండా సమయపాలన పాటించాలని ఆదేశించారు. సదరం శిబిరంలో సర్టిఫికెట్​లు జారీ చేయడం లేదని ఈ సందర్భంగా కలెక్టర్​కు దివ్యాంగులు ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వాసుపత్రి సిబ్బందిపై కలెక్టర్ సీరియస్​
sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.