ETV Bharat / state

పదకొండు మంది పేకాట రాయుళ్ల అరెస్ట్​

author img

By

Published : Jul 16, 2020, 11:03 PM IST

పదకొండు మంది పేకాట రాయుళ్ల అరెస్ట్​..
పదకొండు మంది పేకాట రాయుళ్ల అరెస్ట్​..

నిజామాబాద్ పట్టణంలోని ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న పదకొండు మందిని టాస్క్​ఫోర్స్​ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.65 వేలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు.

నిజామాబాద్ నాలుగో పట్టణ పోలీసు స్టేషన్​ పరిధిలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న పదకొండు మందిని టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నాలుగో పట్టణ ఎస్​ఐ లక్షయ్య పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్టు సీఐ నరేంద్ర పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ. 65,760 నగదు, 5 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పేకాట, జూదం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.