నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో కొవిడ్ బాధితుల వ్యర్థాలను ఇష్టానుసారంగా పడేస్తున్నారని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఓమయ్య ఆరోపించారు. బాధితులు వాడేసిన వాటిని ఆసుపత్రి అవరణలో పడేయడం వల్ల సానిటేషన్ కార్మికులు, మిగితా రోగులకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు.
ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఓమయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. వ్యర్థాలను వెంటనే అక్కడి నుంచి తరలించాలని... ఆసుపత్రికి వచ్చే రోగులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.