ETV Bharat / state

'కొవిడ్​ బాధితుల వ్యర్థాలు ఆసుపత్రి ఆవరణలోనే వేస్తున్నారు'

author img

By

Published : Jul 26, 2020, 4:20 PM IST

aituc leader fire on nizamabad government hospital staff
aituc leader fire on nizamabad government hospital staff

నిజామాబాద్​ ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంపై ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఓమయ్య మండిపడ్డారు. కొవిడ్​ బాధితుల వ్యర్థాలను ఇష్టానుసారంగా పడేస్తున్నారని ఆరోపించారు. వ్యర్థాలను వెంటనే అక్కడి నుంచి తరలించాలని డిమాండ్​ చేశారు.

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో కొవిడ్ బాధితుల వ్యర్థాలను ఇష్టానుసారంగా పడేస్తున్నారని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఓమయ్య ఆరోపించారు. బాధితులు వాడేసిన వాటిని ఆసుపత్రి అవరణలో పడేయడం వల్ల సానిటేషన్ కార్మికులు, మిగితా రోగులకు వైరస్​ వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు.

ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఓమయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. వ్యర్థాలను వెంటనే అక్కడి నుంచి తరలించాలని... ఆసుపత్రికి వచ్చే రోగులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి: శరవేగంగా వైరస్​ వ్యాప్తి‌.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.