ETV Bharat / state

బీటెక్ ప్రవేశాల కౌన్సెలింగ్​ తొలి జాబితా విడుదల

author img

By

Published : Oct 20, 2020, 3:58 PM IST

first-list-of-selected-students-for-counseling-in-rgukt-is-released
కౌన్సెలింగ్​ కోసం ఎంపికైన విద్యార్థుల తొలి జాబితా విడుదల

బాసరలోని ఆర్జీయూకేటీలో 2020-21 విద్యా సంవత్సరానికై 6 సంవత్సరాల సమీకృత బీటెక్ కోర్సులో ప్రవేశాలకై కౌన్సెలింగ్ కోసం ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదలైంది. మొత్తం 42,158 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. మొదటి దశ కింద 1,193 మంది విద్యార్థుల జాబితాను ఏవో రాజేశ్వరరావు విడుదల చేశారు.

నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్​గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో 2020-21 విద్యా సంవత్సరానికై 6 సంవత్సరాల సమీకృత బీటెక్ కోర్సులో ప్రవేశాలకై కౌన్సిలింగ్ కోసం ఎంపికైన విద్యార్థుల జాబితాను విడుదల చేశారు. మొదటి దశ కింద 1,193 మంది విద్యార్థుల జాబితాను ఏవో రాజేశ్వరరావు విడుదల చేశారు.

ఆర్జీయూకేటీకి వచ్చిన మొత్తం దరఖాస్తులు 40,158 కాగా.. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి 40 దరఖాస్తులు వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. మొదటి దశలో 1,193 మంది విద్యార్థులకు ఎంపిక చేసినట్లు వివరించారు. వీరికి నవంబర్ 3 నుంచి 7 వరకు కౌన్సిలింగ్ ఉంటుందన్నారు. ఒక విద్యార్థితో పాటు ఒకరే హాజరు కావాలని సూచించారు.

ఈ సంవత్సరం తెలంగాణలో 1,193 సీట్ల ఎంపికలో అత్యధికంగా జగిత్యాల జిల్లాకు 86 సీట్లు, అత్యల్పంగా నారాయణపేట జిల్లాకు 4 సీట్లు వచ్చాయని తెలిపారు. ఇతర కేటగిరీలకు సంబంధించిన కౌన్సెలింగ్ తేదీలు త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.

ఇదీ చూడండి.. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవం: మంత్రి సబితా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.