నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి హుండీ ఆదాయం రూ. 66,24,630 వచ్చింది. 77 రోజుల అనంతరం ఆదాయం లెక్కించారు. నగదుతో పాటు మిశ్రమ బంగారం 125 గ్రామలు, మిశ్రమ వెండి 3 కేజీల 950 గ్రామలు, 24 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆలయ ఈవో వినోద్ రెడ్డి, ఛైర్మన్ శరత్ పాఠక్, ఏవో లక్ష్మీనారాయణ, దేవదాయ శాఖ నిర్మల్ విభాగం పరిశీలకులు రవికిషన్ సమక్షంలో హుండీ ఆదాయం లెక్కించారు.
ఇదీ చూడండి: స్త్రీలు అన్ని రంగాల్లో రాణించాలి: గవర్నర్ తమిళిసై