నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల కేంద్రంలో పత్తి కొనుగోలు చేయాలంటూ రైతన్నలు ఆందోళన చేపట్టారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కొనుగోళ్లు నిలిపివేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు టోకెన్ నంబరు ఉన్న రైతులు పత్తిని విక్రయించడానికి సీసీఐ కేంద్రానికి తీసుకొచ్చారు.
నివర్ తుఫాన్ ప్రభావంతో మూడురోజుల పాటు పత్తి కొనుగోలు చేయడం లేదని అధికారులు చెప్పడంతో రైతులు ధర్నా నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అధికారులతో మాట్లాడారు. ఈ ఒక్కరోజు కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వడంతో అన్నదాతలు ఆందోళన విరమించుకున్నారు.