YS SHARMILA: 'నాలుగు లక్షల కోట్ల అప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది'

author img

By

Published : Jul 27, 2021, 9:29 PM IST

YS SHARMILA

నాలుగు లక్షల కోట్ల మేర అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో సీఎం కేసీఆర్​ చెప్పాలని వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్​ చేశారు. రాష్ట్రంలో ఒకరికైనా ఉద్యోగమిచ్చారా.. ఒకరికైనా ఇల్లు కట్టారా.. రుణమాఫీ చేశారా.. ఎవరి జేబుల్లోకి వెళ్లిందీ ఈ డబ్బంతా అని నిలదీశారు. బాధ్యతలను గుర్తుచేస్తే.. వ్యక్తిగత దాడికి దిగుతున్నారని ఆరోపించారు.

YS SHARMILA: 'నాలుగు లక్షల కోట్ల అప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది'

వైఎస్​ రాజశేఖర్​రెడ్డి హయాంలో పేదలు ధనికులుగా మారితే... కేసీఆర్ పాలనలో రాష్ట్రమే దివాలా తీసిందని వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. నాలుగు లక్షల కోట్ల అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించిన ఆమె.. బాధ్యతలను గుర్తుచేస్తే వ్యక్తిగత దాడికి దిగుతున్నారంటూ ఆరోపించారు. నిరుద్యోగులకు బాసటగా.. నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంలలో వైఎస్​ షర్మిల నిరాహారదీక్ష చేశారు. ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అంతకుముందు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి.. షర్మిల దీక్షకు పూర్తి మద్దతు పలికారు. నిరుద్యోగుల పక్షాన పోరాడటాన్ని కోమటిరెడ్డి స్వాగతించారు.

'ఏ వర్గాన్ని కదిలించినా అమ్మ అప్పులపాలైపోయామంటున్నారు. బిడ్డ పెళ్లిచేయాలంటే అప్పు.. రైతుకు పెట్టుబడి కావాలంటే అప్పు.. ప్రతి కుటుంబమూ అప్పులపాలైపోయింది తెలంగాణలో. కేసీఆర్​ కుటుంబం మాత్రమే అప్పులపాలు కాలేదు. ఈ రోజు నాలుగు లక్షల కోట్లు మన రాష్ట్రానికి అప్పులున్నాయి. ఎందుకు తీసుకున్నారు.. కేసీఆర్​ సారు. ఒకరికన్నా ఉద్యోగమిచ్చారా.. ఒకరికన్నా ఇల్లు కట్టారా.. రుణమాఫీ చేశారా.. ఎవరి జేబుల్లోకి వెళ్లిందీ ఈ డబ్బంతా.. ఉద్యోగమివ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు.. ఎవరికైనా వచ్చిందా..'

- వైఎస్​ షర్మిల, వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు

ఇదీచూడండి: హుజూరాబాద్‌ నుంచే రెండో విడత గొర్రెల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.