ETV Bharat / state

పార్టీ ఫిరాయించిన 12 మందికి - ఈ ఎన్నికల్లో కార్యకర్తలు బుద్ధి చెప్పాలి : రేవంత్​ రెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 24, 2023, 6:31 PM IST

Updated : Nov 24, 2023, 9:09 PM IST

Revanth Reddy Election Campaign
PCC Chief Revanth Reddy Election Campaign in Nalgonda District

Revanth Reddy Election Campaign at Nakrekal : పార్టీ ఫిరాయించిన 12 మందిని మళ్లీ అసెంబ్లీ గేటు కూడా తాకనీయొద్దని.. ఈ ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి అన్నారు. నల్గొండలోని నకిరేకల్​ నియోజకవర్గంలో జరిగిన కాంగ్రెస్​ విజయ భేరి సభలో ఆయన పాల్గొన్నారు.

Revanth Reddy Election Campaign at Nakrekal : సాయుధ పోరాటానికి నాయకత్వం వహించింది నల్గొండ గడ్డ అనీ.. రజాకార్ల నుంచి ప్రజలకు విముక్తి కల్పించింది నల్గొండ వీరులని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి(Revanth Reddy) చెప్పారు. తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మంత్రి పదవినే వదులుకున్నారని గుర్తు చేశారు. అయితే కొందరు మాత్రం కాంగ్రెస్​ నుంచి గెలిచి దొరల గడీ వద్ద కాపలా కాస్తున్నారని మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన 12 మందిని మళ్లీ అసెంబ్లీ గేటు కూడా తాకనీయొద్దని కోరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​ కార్యకర్తలను మోసం చేసిన వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. నల్గొండ జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గం​లో జరిగిన కాంగ్రెస్​ విజయ భేరీ సభలో ఆయన పాల్గొని.. ప్రసంగించారు.

ఇసుక మీద ఎవరైనా పిల్లర్లు, ప్రాజెక్టులు నిర్మిస్తారా అంటూ రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. లక్షన్నర కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) మూడేళ్లకే కుంగుతుందా అంటూ బీఆర్​ఎస్​ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. నల్గొండకు నీరు ఇచ్చే ఎస్​ఎల్​బీసీ ప్రాజెక్టును ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని గుర్తు చేశారు. అలాగే 10 కిలోమీటర్ల టన్నెల్​ పదేళ్లుగా ఎందుకు పూర్తి కాలేదన్నారు. కేసీఆర్​ తన ఫాంహౌజ్​ చుట్టూ రిజర్వాయర్లు కట్టుకుని.. నల్గొండకు మాత్రం నీరు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 60 ఏళ్లలో కాంగ్రెస్​ సీఎంలు రూ.69 వేల కోట్లు మాత్రమే అప్పులు చేస్తే.. కేసీఆర్​ మాత్రం 9 ఏళ్లలోనే రూ.6 లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. ఈసారి ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో ఎక్కడా బీఆర్​ఎస్​ జెండా ఎగరొద్దన్నారు.

కేటీఆర్ వయసుకు మించి మాట్లాడుతున్నారు - బీఆర్ఎస్, బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ : మైనంపల్లి

"ఈ నకరేకల్​ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే గుండెల మీద తన్ని పార్టీ ఫిరాయించి మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండు. పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్​ కార్యకర్తలు అసెంబ్లీ గేటును తాకనీయవద్దు. ఇప్పుడు మీరిచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోవాలి. మేడిగడ్డ బ్యారేజీ ఇసుక మీద కట్టాడు అంటే.. మతి ఉండి కట్టిండా." - రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

Congress Vijaya Bheri Sabha at Nalgonda : ఎలక్షన్లు, సెలక్షన్లు, కలెక్షన్లు అనే విధానంతో కేసీఆర్​ ముందుకెళుతున్నారని.. కానీ కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి(Komatireddy Venkat Reddy) మాత్రం తెలంగాణ వచ్చే వరకు మంత్రి పదవి తీసుకోలేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో మీరు ఇవ్వబోయే తీర్పు వందేళ్లు వరకు చరిత్రలో నిలిచిపోవాలని కోరారు. కోమటిరెడ్డి వెంకట్​రెడ్డికి, కాంగ్రెస్​కు పేరొస్తుందనే ఎస్​ఎల్బీసీని కేసీఆర్​ పక్కన పెట్టారని విమర్శించారు. ఎవడు దొంగ.. ఎవడు గజదొంగో తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Revanth Reddy Fires on CM KCR : నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకున్నామని.. నీళ్లేమో జగన్, నిధులు మెగా కృష్ణారెడ్డి, కేసీఆర్​ తీసుకెళ్లారని రేవంత్​రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నియామకాలు అనేవి కేసీఆర్​ కుటుంబానికే పరిమితమయ్యాయని విమర్శించారు. మనవడిని మంత్రిని చేసేందుకు కేసీఆర్​ మూడోసారి అవ్వాలని అంటున్నారని ధ్వజమెత్తారు.

పేదోడికి ప్రగతిభవన్​లోకి ప్రవేశం లేదు.. నాడు గద్దరన్నను కూడా లోపలి రానీకుండా ఎర్రటి ఎండలో బయట నిలబెట్టారని ఆరోపించారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు లోపల అతిథి మర్యాదలు.. మనం మాత్రం ఎండలో మగ్గిపోవాలా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్​ బక్కోడు కాదు.. లక్ష కోట్లు దిగమింగిన బకాసురుడు అని దుయ్యబట్టారు. ఇక్కడ కేసీఆర్​కు సీసాలో సారా పోసేవారు.. నేడు మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్నారని ధ్వజమెత్తారు.

పార్టీ ఫిరాయించిన 12 మందికి - ఈ ఎన్నికల్లో కార్యకర్తలు బుద్ధి చెప్పాలి రేవంత్​ రెడ్డి

యువత ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంది తెలంగాణలోనే : జైరాం రమేశ్‌

బీజేపీ, బీఆర్ఎస్​లో ఉంటే పవిత్రులు - ప్రతిపక్షంలో ఉంటే ద్రోహులా? : రేవంత్ రెడ్డి

Last Updated :Nov 24, 2023, 9:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.