ETV Bharat / state

మత్స్య కారుల అభివృద్ధికి చేపల పెంపకంతో ప్రోత్సాహం: ఎమ్మెల్యే భాస్కరరావు

author img

By

Published : Oct 9, 2020, 4:45 PM IST

miryalaguda mla and collector released fishes to aalagadapa lake
మత్స్య కారుల అభివృద్ధికి చేపల పెంపకంతో ప్రోత్సాహం: ఎమ్మెల్యే భాస్కరరావు

మత్స్య కారుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తోందని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు అన్నారు. ఈ సందర్భంగా భాస్కరరావు, కలెక్టర్ ప్రశాంత్​ జీవన్​ పాటిల్.. ఆలగడప చెరువులో లక్షా 50 వేల చేప పిల్లలను వదిలారు.

మత్స్యకారుల అభివృద్ధికి పట్టణాలు, గ్రామాల్లోని చెరువుల్లో చేపల పెంపకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు అన్నారు. వర్షాలు సమృద్ధిగా పడటంతో గ్రామాల్లోని చెరువులు నిండుకుండలా మారాయని చెప్పారు. నల్గొండ జిల్లా ఆలగడప చెరువులో కలెక్టర్ ప్రశాంత్​ జీవన్​ పాటిల్​, ఎమ్మెల్యే కలిసి 1,50,000 చేపపిల్లలను వదిలారు.

2020-21 సంవత్సరానికి గానూ మత్స్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వమే అన్ని చెరువులకి చేప పిల్లలను పంపిణీ చేస్తుందని భాస్కరరావు తెలిపారు. మత్స్యకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ప్రజలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో గంగ పుత్రులకు చేయూతనిస్తూ ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని గత కొన్నేళ్లుగా సీఎం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ తిరునగరు భార్గవ్, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ చింతల్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: పంటల కొనుగోలుపై రేపు మధ్యాహ్నం సీఎం కేసీఆర్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.