శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వాడపల్లి కృష్ణానది ఒడ్డున ఉన్న శ్రీ మీనాక్షి అగస్త్యేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు, మిర్యాలగూడ ఆర్డీఓ రోహిత్ సింగ్లు శివరాత్రి సందర్భంగా అగస్తేశ్వర స్వామి ఆలయానికి రాగా... ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వీరితో ప్రత్యేక పూజలు చేయించి ప్రసాదాలను అందించారు.
ఉదయం భక్తులు తాకిడి కాస్త తగ్గినప్పటికీ... మధ్యాహ్నం సమయానికి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కృష్ణా నది సంగమానికి చేరుకుని స్నానాలు ఆచరించారు. అనంతరం శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
ఇవీ చూడండి: సర్వం శివమయం.. శివాలయాల్లో భక్తజన సందోహం..