నాగర్కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ఉత్తర ద్వారంగా ప్రసిద్ధి చెందిన శ్రీ ఉమామహేశ్వర దేవాలయంను జాతీయ బీసీ కమిషన్ వైస్ ఛైర్మన్ లోకేష్కుమార్, బీసీ కమిషన్ సభ్యులు టి.ఆచారి, కౌశలేంద్ర సింగ్ పటేల్లు సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయ కమిటీ ఛైర్మన్ కందూరి సుధాకర్ వారికి ఘనంగా స్వాగతం పలికారు. వారు స్వామి వారిని దర్శించుకున్న అనంతరం.. ఆలయ సభ్యులు వారిని ఘనంగా సన్మానిoచి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దేవాలయం విశిష్టతను వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధికారులు, భాజపా నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఈ నెల 16న తెరుచుకోనున్న శబరిమల దేవస్థానం