ETV Bharat / state

'ఈనాడు, ఈటీవీ భారత్ కథనానికి స్పందన'

author img

By

Published : Mar 5, 2021, 2:31 PM IST

తల్లిదండ్రులను కోల్పోయి దీన స్థితిలో ఉన్న ఇద్దరు పిల్లలు... చదువుపై మమకారంతో దాతల సాయం అర్థించారు. వారి పరిస్థితిని ' మేము చదువుకుంటాం ..మాకు సాయం చేయండి' శీర్షికతో ఈటీవీ భారత్​లో కథనం ప్రచురితమైంది. పిల్లల కష్టాన్ని చూసిన దాతలు ముందుకొచ్చి వారికి సాయం చేశారు.

'ఈనాడు ఈటీవీ భారత్ కథనానికి స్పందన'
'ఈనాడు ఈటీవీ భారత్ కథనానికి స్పందన'

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం చుక్కయి పల్లికి చెందిన అలివేల, బిచ్చన్న అనారోగ్యంతో మృతి చెందారు. వారికి శివ శంకర్, జోత్స్న పిల్లలు. తల్లిదండ్రులను కోల్పోయిన ఆ చిన్నారుల కష్టంపై ఈటీవీ భారత్​ 'మేము చదువుకుంటాం ..మాకు సాయం చేయండి' శీర్షికతో కథనం ప్రచురితమైంది.

చిన్నారుల పరిస్థితిని చూసిన ఆంధ్రప్రదేశ్​లోని ప్యూర్ సంస్థ స్పందించి... శివశంకర్​,జోత్స్న కు పుస్తకాలు, బ్యాగులు, పెన్నులు, 2 జతల దుస్తులు, ఆన్​లైన్​ తరగతుల కోసం చరవాణి అందించారు. జోత్స్న కల్వకుర్తి గురుకుల పాఠశాలలో ఐదోతరగతి చదువుతుండగా... శివశంకర్​ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. చిన్నారులకు అండగా నిలిచిన ప్యూర్​ సంస్థను పలువురు అభినందించారు.
ఇదీ చూడండి: 'మేం చదువుకుంటాం.. మాకు సాయం చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.