Sharmila: పోడు భూములపై పోరాటానికి సిద్ధమైన వైఎస్​ షర్మిల

author img

By

Published : Jul 21, 2021, 12:53 PM IST

Sharmila

వైఎస్​ఆర్​టీపీ వ్యవస్థపక అధ్యక్షురాలు షర్మిల మరో పోరుకు సిద్ధమయ్యారు. పోడుభూముల కోసం పోరాటం చేయనున్నారు. గురువారం తాడ్వాయి మండలం లింగాలలో పోడుయాత్ర నిర్వహించనున్నారు.

ములుగు జిల్లా తాడ్వాయి మండలం లింగాలలో వైఎస్​ఆర్​టీపీ వ్యవస్థపక అధ్యక్షురాలు షర్మిల గురువారం పోడుయాత్ర చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు పాల్గొని.. విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా ఇంఛార్జీ శ్రీనివాసరెడ్డి కోరారు. రాష్ట్రంలో 43 లక్షల ఎకరాల్లో పోడుభూమి సాగు అవుతుందని చెప్పారు. పోడు భూముల పట్టాల విషయంలో లక్షకుపైగా దరఖాస్తులు ప్రభుత్వం వద్ద పెండింగ్​లో ఉన్నాయన్నారు.

గోవిందరావుపేట మండలం పస్రాలో శ్రీనివాస రెడ్డి మంగళవారం పర్యటించారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూముల విషయంలో ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదన్నారు. గ్రామాల్లో నేనే ప్రజాదర్బార్ నిర్వహించి పోడు సమస్యలను పరిష్కరిస్తానని నమ్మబలికిన కేసీఆర్ ఆ ఊసే ఎత్తలేదన్నారు. లక్షలాది మంది గిరిజనులు తాము సాగు చేసుకుంటున్న భూములు ఎప్పుడు ఏమవుతాయోనన్న భయంతో జీవిస్తున్నారని చెప్పారు.

వారికి రైతు బంధు, రైతు బీమా కల్పిస్తానన్న కేసీఆర్ హామీ నీటి మూటగానే మిగిలిపోయిందన్నారు. గిరిజనుల న్యాయమైన పోడు భూముల సమస్య పరిష్కారాన్ని కాంక్షిస్తూ షర్మిల నిర్వహించతలపెట్టిన లింగాల పోడుయాత్రలో అధిక సంఖ్యలో ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు, రైతులు పాల్గొని విజయవంతం చేయాలని శ్రీనివాస రెడ్డి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో వైఎస్ఆర్ టీపీ నియోజకవర్గ ఇంఛార్జీ బజారు శ్యాంప్రసాద్, నాయ కులు డి.దేవా, ఎండీ, చాంద్​ పాషా, ఎ.తిరుపతి, బి.రమేశ్, అబ్బాస్ అలీ, సతీశ్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: పెళ్లి భోజనం తిని 60 మందికి అస్వస్థత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.