ETV Bharat / state

బస్సు నడుపుతుండగా గుండెపోటుతో డ్రైవర్‌ మృతి.. అందులో 45 మంది..

author img

By

Published : Jan 6, 2023, 4:24 PM IST

Updated : Jan 6, 2023, 7:15 PM IST

Private Bus accident at mulugu district
Private Bus accident at mulugu district

16:21 January 06

గుండెపోటుతో ప్రైవేటు బస్సు డ్రైవర్‌ మృతి

Bus Accident in Mulugu District: ములుగు జిల్లా వెంకటాపురం మండలం అంకన్నగూడెం సమీపంలో యాత్రికుల బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఏపీలోని చిత్తూరు జిల్లా కాణిపాకం నుంచి 45 మంది భక్తులు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో బయల్దేరారు. మార్గ మధ్యలో వెంకటాపురం మండలం అంకన్నగూడెం సమీపంలోకి రాగానే బస్సు డ్రైవర్‌ దేవ ఇరక్కం(57)కు గుండెపోటు రావడంతో సీట్లోనే కుప్పకూలాడు.

దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. ఓ చెట్టుకు తగిలి బస్సు నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తీవ్ర ఆందోళనకు గురైన యాత్రికులు వెంటనే బస్సులో నుంచి సురక్షితంగా కిందకు దిగారు. యాత్రికులెవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్‌ను కిందకు దింపి 108కి సమాచారం అందించారు. అబులెన్స్‌లో వెంకటాపురం సామాజిక ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే డ్రైవర్‌ ఇరక్కం మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

ఇవీ చదవండి: కోర్టు పరిధిలో ఉంచాల్సిన ఆధారాలు సీఎంకు ఎలా చేరాయి: రేవంత్‌రెడ్డి

నిలకడగా సోనియా గాంధీ ఆరోగ్యం.. సర్​ గంగా రామ్​ ఆస్పత్రి ప్రకటన

Last Updated :Jan 6, 2023, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.