ETV Bharat / state

పిల్లలకు విషమిచ్చి.. తల్లి ఆత్మహత్యాయత్నం

author img

By

Published : May 20, 2020, 10:28 PM IST

భర్త వేధింపులు భరించలేక.. ఓ మహిళ తన ఇద్దరి పిల్లలకు విషమిచ్చి.. తాను ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన... మేడ్చల్‌ జిల్లా అలియాబాద్‌లో జరిగింది. పిల్లలిద్దరు మృతిచెందగా.. తల్లి మృత్యువుతో పోరాడుతోంది.

woman-poisons-her-children-commits-suicide
పిల్లలకు విషమిచ్చి.. తల్లి ఆత్మహత్యాయత్నం

మేడ్చల్​ జిల్లా శామీర్​పేట మండలం అలియాబాద్​లో దారుణం జరిగింది. భర్త వేధింపులు తాళలేక ఓ ఇళ్లాలు ఇద్దరి బిడ్డలకు విషమిచ్చి తాను ఆత్మహత్యాయత్నం చేసింది. పిల్లలు మృతిచెందగా... మహిళ పరిస్థితి విషమంగా ఉంది.

శామీర్‌పేట మండలం అలియాబాద్‌కు చెందిన గోపినాథ్‌... అనాథ అమ్మాయిని పెళ్లిచేసుకుంటానని.. వరంగల్‌ అనాథాశ్రమానికి వెళ్లాడు. అక్కడ ప్రీతిని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ఆరేళ్ల క్రితం గోపినాథ్‌, ప్రీతి వివాహం చేసుకున్నారు. కొంతకాలంగా వీరిద్దరూ తరచూ గొడవపడుతున్నారు. గొడవ జరిగిన ప్రతిసారి ప్రీతి తాను పెరిగిన అనాథ ఆశ్రమానికి వెళ్లి ఉండేది. ఇప్పుడు మరోసారి ఇద్దరి మధ్య గొడవ తీవ్రం కావడం వల్ల మనస్తాపం చెందిన ప్రీతి ఇద్దరు పిల్లలకు విషమిచ్చి... బలవన్మరణానికి యత్నించింది. పిల్లలిద్దరూ మృతిచెందగా... ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

ఇదీ చూడండి: పెట్రోల్​ బంక్​ వద్ద ఘర్షణ.. సీసీ కెమెరాల్లో రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.