ETV Bharat / state

అనుమతులు లేకుండా నిర్మించిన ఐదంతస్తుల భవనం సీజ్​

author img

By

Published : Apr 28, 2021, 11:23 AM IST

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్‌ నగర పాలక సంస్థ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై చర్యలకు అధికారులు శ్రీకారం చూట్టారు. మియాపూర్‌ రెవెన్యూ పరిధిలో నిబంధనలు అతిక్రమించి నిర్మించిన ఐదంతస్తుల భవనాన్ని మున్సిపల్​ అధికారులు సీజ్​ చేశారు.

తెలంగాణ వార్తలు
మల్కాజిగిరి జిల్లా

నిబంధనలు అతిక్రమించి నిర్మించిన ఐదంతస్తుల భవనాన్ని బోడుప్పల్​ నగరపాలక సంస్థ అధికారులు సీజ్​ చేశారు. మియాపూర్​ రెవెన్యూ డివిజన్​ పరిధిలోని సర్వే నంబరు 6లోని రెడ్డి కాలనీలో ఓ స్థిరాస్తి వ్యాపారి నిర్మించిన భవనానికి సంబంధించి అనుమతి పత్రాలు చూపాలని అధికార్లు పలుమార్లు సూచించారు.

ఎంతకాలమైనా భవనం యజమాని నుంచి స్పందన లేకపోవడం వల్ల మున్సిపల్​ కమిషనర్​ బి.శ్రీనివాస్​ ఆదేశాలపై అధికారులు భవనాన్ని సీజ్​ చేశారు. సీల్​ను తొలగిస్తే మున్సిపల్​ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: కిరాక్‌ మోసం: 4ఎకరాలు చూపి కోటికి టోపి, అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.