ETV Bharat / state

Ponnala laxmaiah: 'కేసీఆర్​పై ఎన్ని కేసులున్నాయో.. సీబీఐ 2014లోనే ప్రకటించింది'

author img

By

Published : Aug 25, 2021, 2:35 PM IST

ponnala
ponnala

రేవంత్ వచ్చాక కాంగ్రెస్​కు కొత్త ఉత్సహం వచ్చిందని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. మూడు చింతలపల్లిని దత్తత తీసుకున్న సీఎం.. ఈ ఊరికి ఏం చేశారని ప్రశ్నించారు.

మేడ్చల్​ జిల్లా మూడు చింతలపల్లిని సీఎం కేసీఆర్ దత్తత తీసుకుని ఏం చేశారని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. సీఎం దత్తత తీసుకున్న మూడు చింతలపల్లిలో కాంగ్రెస్‌ నిర్వహిస్తున్న రెండు రోజుల దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్షలో పొన్నాల పాల్గొన్నారు. దత్తత అంటే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని.. కాంగ్రెస్ హయాంలో చాలా గ్రామాలు చేసి చూపించామని పొన్నాల వివరించారు. సీఎం ఒక్క వర్గానికే డబ్బులిస్తామని చెప్పడం అవివేకమన్నారు. కేసీఆర్ చేసిన ద్రోహానికి చరిత్ర క్షమించదని ఆరోపించారు. సీబీఐ 2014లోనే కేసీఆర్‌పై మూడు కేసులున్నాయని ప్రకటించిందన్నారు. రానున్న రోజుల్లో కేసీఆర్​కు జైలు జీవితమేనని తెలిపారు. వరంగల్‌ కొత్త జైలు కేసీఆర్‌ కోసమే కట్టుకుంటున్నారని దుయ్యబట్టారు.

మూడు చింతలపల్లిని దత్తత తీసుకొని కేసీఆర్​ ఏం చేశారు: పొన్నాల

ఇదీచూడండి: Revanth Reddy: 'నీళ్లేమో జగన్​రెడ్డి తీసుకపాయే.. నిధులేమో కేసీఆర్ ఇంట్లోకి చేరె'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.