షర్మిలమ్మ పాదయాత్రలో గులాబీ నేతల ధర్నా.. డౌన్​.. డౌన్​.. అంటూ నినాదాలు

author img

By

Published : Oct 4, 2022, 10:09 PM IST

YS Sharmila

Sharmila Padayatra TRS leaders protests: వైఎస్​ షర్మిల చేస్తోన్న ప్రజా ప్రస్థాన పాదయాత్రలో కొందరు తెరాస కార్యకర్తలు నిరసన తెలిపారు. మెదక్​ జిల్లాలోని చేగుంట దగ్గర్లో పాదయాత్ర జరుగుతుండగా కొందరు తెరాస కార్యకర్తలు గులాబీ కండువాలు ధరించి షర్మిల డౌన్​ డౌన్​ అంటూ నినాదాలు చేశారు.

Sharmila Padayatra TRS leaders protests: వైఎస్​ షర్మిల చేస్తోన్న ప్రజా ప్రస్థాన పాదయాత్రలో కొందరు తెరాస కార్యకర్తలు నిరసన తెలిపారు. మెదక్​ జిల్లా చిన్న శంకరంపేట వైపు నుంచి షర్మిల పాదయాత్రగా చేగుంట గాంధీ చౌరస్తాకు పాదయాత్ర నడుస్తోంది. ఈ క్రమంలో తెరాస కార్యకర్తలు గులాబీ రంగు కండువాలు ధరించి షర్మిల డౌన్ డౌన్​ అంటూ నినాదాలు చేశారు. ఇది గమనించిన పోలీసుల వారిని అడ్డుకున్నారు. నినాదాలు చేసిన వారిని అదుపులోకి తీసుకొని చేగుంట పోలీసు స్టేషన్​కు తరలించారు.

షర్మిలమ్మ పాదయాత్రలో గులాబీ నేతల గోల.. డౌన్​.. డౌన్​.. అంటూ నినాదాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.