ETV Bharat / state

శ్రీరాజరాజేశ్వరీదేవి అలంకరణలో ఏడుపాయల వనదుర్గామాత

author img

By

Published : Oct 24, 2020, 3:07 PM IST

మెదక్​ జిల్లా పాపన్నపేట మండలం నాగ్‌సాన్‌పల్లిలోని ఏడపాయల దేవస్థానంలో దేవీనవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఎనిమిదో రోజు అమ్మవారు శ్రీరాజరాజేశ్వరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది.

navratri 8th day celebrations in edupayala vana durga devi temple in medak district
శ్రీరాజరాజేశ్వరీదేవి అలంకరణలో ఏడుపాయల వనదుర్గామాత దర్శనం

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఏడుపాయల దేవస్థానంలో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు వనదుర్గాదేవి శ్రీరాజరాజేశ్వరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.


రాజగోపురంలో ఏర్పాటు చేసిన ఉత్సవ విగ్రహానికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రుల్లో చివరి రోజైన దసరారోజు అమ్మవారిని మహిషాసురమర్దిని అవతారంలో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించనున్నట్టు ఆలయ ఈవో సారశ్రీనివాస్ తెలిపారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.

ఇదీ చదవండి: భద్రాద్రిలో వీరలక్ష్మి అవతారంలో అమ్మవారు దర్శనం

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.