ETV Bharat / state

30 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

author img

By

Published : Mar 20, 2020, 1:34 PM IST

30 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
30 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

మందమర్రిలో రూ. 30 లక్షల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించామని ఎస్సై శివ కుమార్​ పేర్కొన్నారు.

మంచిర్యాల జిల్లా మందమర్రిలో నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని కర్నూలుకు చెందిన శివయ్య, హైదరాబాద్​కు చెందిన లక్ష్మయ్య, శివ కలిసి 16 క్వింటాళ్ల పత్తి విత్తనాలను వాహనంలో తరలిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించినట్లు ఎస్సై శివ కుమార్​ తెలిపారు.

పత్తి విత్తనాల విలువ సుమారు రూ. 30 లక్షలు ఉంటుందని అని ఎస్సై చెప్పారు. విత్తనాల తరలింపులో మరో ముగ్గురు పాత్ర ఉందని గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

30 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

ఇదీ చూడండి: రాష్ట్రంలో 16కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.