సముద్ర తీరాల్లో మాత్రమే కనిపించే అరుదైన చేప చిన్నచింతకుంట యువకులకు దొరికింది. మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంటలోని ఊకచెట్టు వాగులో చేపల వేటకు వెళ్లిన యువకులకు మనుగుమియా చేప కనిపించింది.
మొదట పాము అనుకొని భయపడిన యువకులు... దానిని పరిశీలించగా మనుగుమియా రకం చేపగా గుర్తించి పట్టుకున్నారు. మూడు అడుగుల మేర ఉన్న చేపను స్థానికులు ఆశ్చర్యంగా తిలకించారు. ఇది ఎక్కువగా సముద్రతీర ప్రాంతాల్లో లభిస్తోందని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. మార్కెట్లో ఈ చేపకు మంచి డిమాండ్ ఉంటుంది. కిలో సుమారు రూ.500 నుంచి 1,000 వరకు పలుకుతుందని తెలిపారు.