YS SHARMILA: రేపు మహబూబాబాద్​ జిల్లాలో 'నిరుద్యోగ దీక్ష'.. 18న 'పోడుభూములకై పోరు'

author img

By

Published : Aug 16, 2021, 8:16 PM IST

YS SHARMILA: రేపు మహబూబాబాద్​ జిల్లాలో 'నిరుద్యోగ దీక్ష'.. 18న 'పోడుభూములకై పోరు'

నిరుద్యోగ నిరాహార దీక్ష కార్యక్రమంలో భాగంగా వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్​. షర్మిల రేపు మహబూబాబాద్​ జిల్లాలో దీక్ష చేపట్టనున్నారు. గుండెంగి గ్రామంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దీక్ష కొనసాగించనున్నారు.

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్​. షర్మిల రేపు మహబూబాబాద్​ జిల్లాలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా గూడూరు మండలం సోమ్లా తండాలో ఆత్మహత్యకు పాల్పడిన బోడ సునీల్​ నాయక్​ కుటుంబాన్ని ఆమె పరామర్శించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అనంతరం గుండెంగి గ్రామంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దీక్ష చేపట్టనున్నట్లు వివరించారు.

18న పోడు భూములకై పోరు..

ఈ సందర్భంగా పోడు భూముల సమస్య పరిష్కారం కోసం.. పోడు రైతులకు భరోసా కల్పించేందుకు షర్మిల ఈ నెల 18న ములుగు జిల్లాలో 'పోడుభూములకై పోరు' కార్యక్రమాన్ని చేపట్టనున్నారని పార్టీ నేతలు తెలిపారు. ఉద‌యం 11 గంట‌ల‌కు ములుగు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూల‌మాల వేసి.. అనంత‌రం ప‌స్రా గ్రామంలోని కుమురం భీం విగ్రహానికి నివాళులర్పించి.. లింగాల గ్రామం వ‌ర‌కు భారీ ర్యాలీ చేప‌ట్టనున్నట్లు వివరించారు. లింగాల‌లో 'పోడుభూములకై పోరు' కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నారు.

ఇదీ చూడండి: ఆత్మహత్యాయత్నం చేసిన సునీల్​ నాయక్​ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.