ETV Bharat / state

ఈసారి ధాన్యం అమ్మకాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు: మంత్రి సత్యవతి

author img

By

Published : Oct 30, 2020, 10:33 PM IST

కొవిడ్​-19 వల్ల గత సీజన్​లో ధాన్యాన్ని అమ్మకంలో రైతులకు కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయని, ఈసారి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగవని మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. మక్కలు కొనమని సీఎం చెప్పినా.. చాలామంది రైతులు మక్కలు వేశారన్నారు. అయితే వారు నష్టపోవద్దనే ఉద్దేశంతో మక్కలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ప్రకటించారని తెలిపారు. రైతుల పట్ల సీఎంకున్న ప్రేమకు ఇది నిదర్శనమన్నారు.

ఈసారి ధాన్యం అమ్మకాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు: మంత్రి సత్యవతి
ఈసారి ధాన్యం అమ్మకాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు: మంత్రి సత్యవతి

కొవిడ్​-19 వల్ల గత సీజన్​లో ధాన్యాన్ని అమ్మకంలో రైతులకు కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయని, ఈసారి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగవని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైతు వేదికలు, పంటల కొనుగోళ్లు, పత్తి, వరి ధాన్యం సేకరణ తదితర అంశాలపై సమీక్షించారు.

ఈసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రైతులు ఎక్కువగా సన్న రకాలు వేశారని మంత్రి సత్యవతి రాఠోడ్​ పేర్కొన్నారు. మక్కలు కొనమని సీఎం చెప్పినా.. చాలామంది రైతులు మక్కలు వేశారన్నారు. అయితే వారు నష్టపోవద్దనే ఉద్దేశంతో మక్కలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ప్రకటించారని తెలిపారు. రైతుల పట్ల సీఎంకున్న ప్రేమకు ఇది నిదర్శనమన్నారు.

గన్నీ బ్యాగుల కొరత, రవాణా, నిల్వ చేయడంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ గౌతమ్, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: దీక్షిత్‌ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటాం: మంత్రి సత్యవతి

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.