ETV Bharat / state

తెలంగాణ ఏర్పడిన తర్వాతే.. మహిళలకు గౌరవం దక్కింది: మంత్రి సత్యవతి రాథోడ్

author img

By

Published : Mar 6, 2022, 5:01 PM IST

Minister Satyavathi Rathod
మంత్రి సత్యవతి రాథోడ్

Minister Satyavathi Rathod: దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో మహిళల సంక్షేమం, రక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు కేసీఆర్​ కిట్​లు అందచేశారు. వారితో కలిసి కాసేపు సెల్ఫీలు దిగారు.

Minister Satyavathi Rathod: తెలంగాణ ఏర్పడిన తర్వాతే రాష్ట్రంలోని మహిళలకు సమాజంలో గౌరవం దక్కిందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు కేసీఆర్ కిట్ లను అందచేశారు. వారితో కలిసి సెల్ఫీలు దిగారు.

Minister taking selfie with mother and child
తల్లి బిడ్డతో సెల్ఫీ దిగుతున్న మంత్రి
The minister playing with the child
చిన్నారిని ఆటాడిస్తున్న మంత్రి

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం అయిన బాలింతలకు 16 వస్తువులతో కూడిన ఒక కేసీఆర్ కిట్​ను అందిస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. మహిళల రక్షణ కోసం షీటీమ్స్, సఖి సెంటర్లు, కౌన్సిలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారని తెలిపారు. అనంతరం ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బందిని సన్మానించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్‌ పర్సన్‌ బిందు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఉపాధ్యాయుడిపై మూడో తరగతి పిల్లాడి ఫిర్యాదు.. ఎందుకో తెలుసా...?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.