మహబూబాబాద్ జిల్లాలో తెరాసలో ఘర్షణ

author img

By

Published : Aug 26, 2022, 7:46 PM IST

తెరాస

Clash in Trs Leaders ఎల్లంపేట గ్రామంలో అధికార తెరాసలో ఘర్షణ నెలకొంది. గ్రామ పంచాయతీ నిధులను సర్పంచ్ శ్రీనివాస్ దుర్వినియోగం చేశారంటూ పీఎసీఎస్ వైస్ ఛైర్మన్ మహేశ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో జీపీ నిధుల విషయంలో అవినితీ జరిగిదంటూ నిరూపించాలని సర్పంచ్ వారికి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు చర్చకు రావడంతో గొడవ తలెత్తింది.

Clash in Trs Leaders: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో అధికార తెరాసలో ఘర్షణ చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ నిధులను సర్పంచ్ దుర్వినియోగం చేశారంటూ పీఎసీఎస్ వైస్ ఛైర్మన్ మహేశ్ వర్గానికి చెందిన వారు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అదే విధంగాగత కొన్ని నెలల నుంచి సక్రమంగా గ్రామ సభలు నిర్వహించడం లేదని, గ్రామాభివృద్ధి నిధుల వివరాలు చెప్పడం లేదంటూ అందులో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో సర్పంచ్ శ్రీనివాస్ నిధుల దుర్వినియోగం జరగలేదంటూ.. అవినీతి జరిగినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. ఈ క్రమంలో మహేష్ వర్గం జీపీ నిధులు అవకతవకలు నిరూపిస్తామంటూ చర్చకు రావడంతో ఇరు వర్గాల మధ్య గొడవ తలెత్తింది. ఒక్కసారిగా ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో గ్రామస్థులు వారికి సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఈ క్రమంలో తమపై సర్పంచ్ వర్గం వారు దాడిచేశారని మహేశ్ వర్గం ఆరోపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని పరిస్థితిపై ఆరా తీశారు. ఈ రెండు వర్గాల వారు అధికార పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం.

మహబూబాబాద్ జిల్లాలో తెరాసలో ఘర్షణ

ఇవీ చదవండి: బండి సంజయ్ పాదయాత్రలో స్వల్ప ఉద్రిక్తత, పోలీసుల లాఠీఛార్జ్​

మన ప్లాన్​ ఇది కాదు కదా, ఆజాద్​ రాజీనామాపై జీ23 నేతల రియాక్షన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.