ETV Bharat / state

డోర్నకల్​లో రక్తదానం చేసిన పోలీసులు

author img

By

Published : Oct 17, 2019, 2:51 PM IST

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని మహబూబాబాద్​ జిల్లా డోర్నకల్​లో పోలీసులు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

డోర్నకల్​లో రక్తదానం చేసిన పోలీసులు

అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని మహబూబూబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. డోర్నకల్​లో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఎస్పీ స్వయంగా రక్తదానం చేసి అందరిలో స్ఫూర్తి నింపారు. ప్రతి ఒక్కరు రక్తదానం చేసినట్లయితే ఆపదలో ఉన్నవారికి ప్రాణదానం చేసినవారవుతారని సూచించారు. రక్తదాన కార్యక్రమాల్లో యువత ముందంజలో ఉండాలని తెలిపారు.

డోర్నకల్​లో రక్తదానం చేసిన పోలీసులు

ఇదీ చదవండిః కొల్లాపూర్​లో పోలీసుల రక్తదాన శిబిరం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.