ETV Bharat / state

'కౌన్సిలర్లు లేవనెత్తిన సమస్యలు పరిష్కరించండి'

author img

By

Published : Apr 6, 2021, 4:27 PM IST

Municipal meeting
కాగజ్​నగర్ పురపాలక సంఘం

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్ పురపాలక సంఘంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాలకవర్గం 12 అంశాలను చర్చించి ఆమోదించింది.

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్ పురపాలక సంఘంలో ఛైర్మన్ సద్దాం హుస్సేన్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ భేటీలో పాలకవర్గం 12 అంశాలను చర్చించి ఆమోదించింది. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు పట్టణంలో నెలకొన్న సమస్యలను లేవనెత్తారు. గతవారం ప్రవేశపెట్టిన బడ్జెట్​ను అధికారులు కౌన్సిలర్లను సంప్రదించకుండానే తయారు చేశారని ఆరోపించారు.

డిప్యుటేషన్​పై ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారి వద్ద సరైన సమాచారం ఉండటం లేదని కౌన్సిలర్లు అన్నారు. వార్డుల్లో పైప్​లైన్ లీకేజీ అవుతుందంటూ సిబ్బందికి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని వాపోయారు. కౌన్సిలర్లు లేవనెత్తిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఛైర్మన్ సద్దాం హుస్సేన్... కమిషనర్​ను, అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి: ట్రాక్టర్ డ్రైవర్ హత్య.. వివాహేతర సంబంధమేనా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.