ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ఎర్రపాలెంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాన్వాయ్ను యువజన కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎర్రపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఆయనను కార్యకర్తలు అడ్డగించారు.
దళిత బంధు పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు యువజన కాంగ్రెస్ కార్యకర్త రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలో కాన్వాయ్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. వారి నిరసనతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అరెస్ట్ చేసిన కార్యకర్తలను పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇదీ చదవండి: Heavy rain in karimnagar : కాసేపే కుండపోత వర్షం.. ఆలోపే నగరమంతా జలమయం