ETV Bharat / state

బీఆర్​ఎస్​ను గెలిపిస్తే అభివృద్ధి ముందుకు - కాంగ్రెస్​ గెలిస్తే అభివృద్ధి ఉండదు : కేసీఆర్​

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 21, 2023, 3:10 PM IST

Updated : Nov 21, 2023, 5:20 PM IST

CM KCR Fires on Congress
BRS Chief KCR Speech in BRS Public Meeting at Madhira

BRS Chief KCR Speech in BRS Public Meeting at Madhira : బీఆర్​ఎస్​ను గెలిపిస్తే అభివృద్ధి ముందుకెళుతుంది.. కాంగ్రెస్​ గెలిస్తే అభివృద్ధి ఉందని.. మళ్లీ కథ మొదటికేనని బీఆర్​ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్​ తెలిపారు. పట్టిలేని భట్టి విక్రమార్కను మధిరలో గెలిపిస్తే ఇక్కడి ప్రజలకు ఏమీరాదని ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో జరిగిన బీఆర్​ఎస్​ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్​ పాల్గొన్నారు.

BRS Chief KCR Speech in BRS Public Meeting at Madhira : పట్టిలేని భట్టి విక్రమార్కకు మళ్లీ ఓటేస్తే ఇక్కడి ప్రజలకు ఏమీరాదని.. కాంగ్రెస్​కు మళ్లీ 20 సీట్లు మాత్రమే వస్తాయని బీఆర్​ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్(CM KCR)​ అన్నారు. అందుకే ఈసారి బీఆర్​ఎస్​ అభ్యర్థి కమల్​రాజును గెలిపిస్తే.. మధిర నియోజకవర్గంలోని దళితులందరికీ దళిత బంధు ఇస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్​ఎస్​ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​ పార్టీపై విమర్శలు గుప్పించారు.

దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ తయారైందని.. ప్రతి ఇంటికి మంచినీరు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్​ కొనియాడారు. చిత్తశుద్ధితో పని చేస్తేనే విజయాలు సాధ్యమవుతాయని అన్నారు. మధిరలో కాంగ్రెస్​ తరఫున గెలిచిన భట్టిపై ఎలాంటి వివక్ష లేదని తెలిపారు. ఉత్తర భారతదేశంలో దళితులపై భయంకరమైన దాడులు జరుగుతున్నాయని ఆవేదన చెందారు. అందుకే దళితబంధు(Dalith Babdhu)లో రిజర్వేషన్లు పెట్టి వారికి ఇస్తున్నామని హర్షించారు. ఈ నియోజకవర్గంలో భట్టి విక్రమార్క గెలిస్తే ఆరు నెలలకు ఒక్కసారి మాత్రమే ఇక్కడకు వస్తున్నారని విమర్శించారు.

ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలే అందుకే ఆలోచించి ఓటేయండి : కేసీఆర్

CM KCR Fires on Congress Party : 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్​ ఏం చేసిందో ఒకసారి ఆలోచించాలని సభికులను కోరారు. ఒకనాడు ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్​.. బలవంతంగా తీసుకెళ్లి ఆంధ్రలో కలిపి ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు. పైగా కాంగ్రెస్​ తెలంగాణ ఇవ్వకుండా.. అప్పటి టీఆర్​ఎస్​(బీఆర్​ఎస్​) పార్టీని చీల్చే ప్రయత్నం చేసిందని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్​ హయాంలో మధిరలో కరెంటు ఉండేలా.. ఇప్పుడు బీఆర్​ఎస్ వల్ల నాణ్యమైన విద్యుత్​ అందిస్తున్నామని సీఎం కేసీఆర్​ హర్షం వ్యక్తం చేశారు. రైతుబంధు ఇవ్వొద్దు.. కరెంటు ఇవ్వొద్దని కాంగ్రెస్​ అంటోందన్నారు. ధరణి స్థానంలో భూమాత పెడతారట.. వాళ్లు పెట్టేది భూమాత కాదు భూమేత అని ఎద్దేవా చేశారు. బీఆర్​ఎస్​ను గెలిపిస్తే అభివృద్ధి ముందుకెళుతుంది.. కాంగ్రెస్​ గెలిస్తే అభివృద్ధి ఉందని.. మళ్లీ కథ మొదటికేనని తెలిపారు.

"ప్రజాస్వామ్యంలో ప్రజల వద్ద ఉండే బలమైన ఆయుధం ఓటు. వచ్చే ఐదు సంవత్సరాలకు మీ రాష్ట్ర భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది. మధిర చాలా చైతన్యవంతమైన ప్రాంతం. రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో మీరు బీఆర్​ఎస్​ను గెలిపించలేదు. అయినా మీ మీద నాకు కోపం లేదు. దళితబంధును కూడా ఇక్కడ ఇచ్చాము. కాంగ్రెస్​ అభ్యర్థి భట్టి విక్రమార్క ఉన్నారని నేను కక్ష కట్టలేదు. దళిత సమాజం ఎప్పటికీ అలాగా దిగువనే ఉండాలా.. అందుకే దళితబంధు తీసుకువచ్చాను." - కేసీఆర్​, బీఆర్​ఎస్​ అధినేత

BRS Praja Ashirvada Sabha At Madhira : అమెరికాలో ఎన్నికల కోసం ప్రచార సభలు జరగవని.. ఎన్నికల్లో జాగ్రత్తగా ఓటు వేసే విధానంగా రావాలని సీఎం కేసీఆర్​ సూచించారు. 75 ఏళ్ల ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సిన పరిణతి ఇంకా రాలేదని ఆవేదన చెందారు. మీ ఓటు మీ భవిష్యత్తుతో పాటు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తోందన్నారు. అభ్యర్థులతో పాటు వారి పార్టీల చరిత్రను కూడా ఒకసారి చూడాలని హితవు పలికారు. బీఆర్​ఎస్​ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని పేర్కొన్నారు.

బీఆర్​ఎస్​ను గెలిపిస్తే అభివృద్ధి ముందుకు - కాంగ్రెస్​ గెలిస్తే అభివృద్ధి ఉండదు

కాంగ్రెస్ మన ఓటుతో మన కళ్లల్లోనే పొడిపించాలని చూస్తోంది: కేసీఆర్

'బీఆర్​ఎస్​ పోరాటానికి భయపడే నాడు కాంగ్రెస్​ ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది'

Last Updated :Nov 21, 2023, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.