ETV Bharat / state

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు నిరసిస్తూ తెదేపా ధర్నా

author img

By

Published : Mar 5, 2021, 5:58 PM IST

Telugudesam party leaders held a dharna in front of the Karimnagar district collectorate
కరీంనగర్​ కలెక్టరేట్ ఎదుట తెదేపా నేతలు నిరసన

కరీంనగర్ జిల్లా​ కలెక్టరేట్ ఎదుట తెలుగుదేశం పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరను తగ్గించాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఏవోకు వినతి పత్రం అందజేశారు.

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరను తగ్గించాలని తెతెదేపా రాష్ట్ర కార్యదర్శి కళ్యాణపు ఆగయా డిమాండ్ చేశారు. ధరల నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.

ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కేంద్రం విధానాల వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు.

గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. కలెక్టరేట్ ఏవోకు వినతి పత్రం అందజేశారు.

ఇదీ చూడండి: పదవులు లేకున్నా ప్రజల పక్షాన పోరాడతా: ఎల్‌.రమణ

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.