ETV Bharat / state

సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

author img

By

Published : Aug 1, 2020, 7:11 PM IST

కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ మేరకు 34 మంది బాధితులకు రూ.8 లక్షల 64 వేలను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అందజేశారు.

సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. చొప్పదండి మండలానికి చెందిన 34 మంది లబ్ధిదారులకు రూ.8 లక్షల 64 వేల రూపాయల చెక్కులను అందజేశారు.

సకాలంలో దరఖాస్తు చేసుకోవాలి...

పేద కుటుంబాలు మెరుగైన వైద్యం పొందటానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపకరిస్తోందన్నారు. ప్రైవేట్ వైద్యం పొందిన వారు సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేసేందుకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : కరోనాతో వ్యక్తి మృతి.. రాత్రంతా ఇంటి ముందే ఉన్న మృతదేహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.