ETV Bharat / state

'టూర్​కు వెళ్లారనుకున్నా.. ఇలా అవుతుందని అనుకోలే'

author img

By

Published : Feb 17, 2020, 12:41 PM IST

mla-manohar-reddy-and-cp-kamalasanreddy-visit-kakathiya-canal-spot-in-karimnagar-district
'టూర్​కు వెళ్లారనుకున్నా... ఇలా అవుతుందని అనుకోలే'

కరీంనగర్‌లోని అలుగునూర్ కాకతీయ కాలువలో ప్రమాదంపై ఎస్పీ కమలాసన్​రెడ్డి ఆరా తీశారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే మనోహర్​రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ యాత్రలకు వెళ్తుంటారని.. ఇప్పుడు అలాగే వెళ్లారేమో అనుకున్నట్లు తెలిపారు.

కరీంనగర్​ జిల్లా కాకతీయ కాలువ ప్రమాద ఘటన స్థలిని పోలీసు కమిషనర్​ కమలాసన్​రెడ్డి పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. మృతులు పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్​ రెడ్డి చెల్లె, బావ, వారి కుమార్తెలని గుర్తించారు.

సోదరి కుటుంబం మృతిపై ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జనవరి 27న కరీంనగర్​లోని బ్యాంక్​ కాలనీ నుంచి బయలుదేరినట్లుగా తెలిపారు. ఏడాదికోసారి యాత్రలకు వెళ్తారని... ఇందులో భాగంగానే ఈ ఘటన చోటుచేసుకుని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. తమ బావ వ్యాపారవేత్త, చెల్లెలు ప్రభుత్వ ఉద్యోగిని అని చెప్పారు. ఎవరితో ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు.

'టూర్​కు వెళ్లారనుకున్నా... ఇలా అవుతుందని అనుకోలే'

సంబంధిత కథనం: కాకతీయ కాలువలో ఎమ్మెల్యే చెల్లి, బావ, మేనకోడలి మృతదేహాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.