ETV Bharat / state

దళితబంధుపై మంత్రి గంగుల ప్రజాభిప్రాయ సేకరణ

author img

By

Published : Aug 31, 2021, 11:31 AM IST

Minister's visit to Huzurabad ... Poll on Dalit Bandhu
దళితబంధుపై అభిప్రాయా సేకరణ

హుజురాబాద్​లో దళితబంధు పథకంపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే కార్యక్రమాన్ని చేపట్టారు.. బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్. దమ్మక్కపేటలో పర్యటించారు.

దమ్మక్కపేటకు చెందిన శోభమ్మ- బొందయ్య ఇంటికి వెళ్లి వారితో మంత్రి గంగుల కాసేపు మాట్లాడారు. దళిత బంధు పథకంపై వారికి అవగాహన కల్పించారు. రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబం ఆర్థికంగా ఎదగాలన్న ఆకాంక్షతో ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని మంత్రి చెప్పారు.

దళితబంధుపై అవగాహన కల్పిస్తున్న మంత్రి గంగుల

దళిత బంధు పథకంపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. దళితబంధు ద్వారా ప్రయోజనం ఉంటుందా? లేదా ? అని అడిగారు. దళితబంధు లబ్ధిదారులంతా ఒకే వ్యాపారంపై దృష్టి పెట్టొద్దని సూచించారు. అధికారుల సూచనలతో వివిధ రంగాలపై దృష్టిసారించాలని చెప్పారు. దళితులంతా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారా? లేరా? అని మంత్రి పలువురిని ప్రశ్నించారు. దళిత బంధు పథకంలో ఇచ్చిన పది లక్షలను ఏడాదిలోగా 20 లక్షలు చేసి చూపించాలని సూచించారు. దమ్మక్కపేటలోని దళిత కాలనీలో కాలినడకన తిరుగుతూ అభిప్రాయాలను సేకరించిన మంత్రి... అర్హులందరికీ దళిత బంధు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు.

ఇదీ చదవండి:హైదరాబాద్‌లో... వ్యాక్సినేషన్​ ప్రక్రియ వేగవంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.