ETV Bharat / state

Harish Rao Comments: 'అన్నీ అమ్మేసి ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నరు'

author img

By

Published : Oct 9, 2021, 4:41 PM IST

Harish Rao
Harish Rao

హుజూరాబాద్​లో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్​యాదవ్​కు మద్దతుగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు (Harish Rao Comments) ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పెంచికల్​పేటలో మహిళలతో సమావేశమయ్యారు.

'అన్నీ అమ్మేసి ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారు'

కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు విమర్శలు (Harish Rao Comments) గుప్పించారు. హుజూరాబాద్​ నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్​కు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. పెంచికల్​పేటలో మహిళలతో సమావేశమైన మంత్రి హరీశ్​... భాజపాకు ఓటు వేయకూడదని అభ్యర్థించారు.

కేంద్రం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తోందని ఆరోపించారు. అన్నీ అమ్మేసి ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారని ధ్వజమెత్తారు. హరీశ్‌రావు గ్యాస్‌ సిలిండర్‌ ధరను మహిళలు గుర్తుంచుకోవాలన్న హరీశ్‌రావు... సిలిండర్‌ ధరను రూ.వెయ్యికి పెంచారని గుర్తు చేశారు. ఈ ధరను త్వరలోనే రూ.1,500కు పెంచుతారని ఎద్దేవా చేశారు. కిలో వంట నూనె ధర దాదాపు రూ.200, పెట్రోల్‌, డీజిల్ ధర రూ.100 దాటిపోయిందన్నారు.

గ్యాస్ సిలిండర్ల ధర ఎంత పెరిగిందో మా అక్కచెల్లెలు చెప్పాలే. నిన్న మళ్ల 15 రూపాయలు పెంచారు. బతుకమ్మ పండుగ ముందర... అరె ఇదెక్కడి కథ. గతంలో ఇదే నరేంద్రమోదీ, ఈటల రాజేందర్ పార్టీ ఏమన్నదంటే... 400 రూపాయలు గ్యాస్ సిలిండర్ ధర పెరిగితే... ఓటు వేసే ముందు ఆ సిలిండర్​కు మొక్కివెళ్లాలని చెప్పిండ్రు. అలాంటిది ఇప్పుడు 1000 రూపాయులు చేసిండ్రు. సబ్సిడీ 250 రూపాయలు వస్తుండే. అది కూడా పోయింది. అయినా ఈటల రాజేందర్ ఏమంటుండు... మేం సిలిండర్ 1000 రూపాయలు చేసినం.. నన్ను చూసి ఓటేయండి అంటున్నడు. 1000 రూపాయలు చేసిన వీళ్లే రేపు 1500 చేస్తరు. దయచేసి మా అక్కచెల్లెలు ఆలోచించాలే.

-- హరీశ్​రావు, ఆర్థిక శాఖ మంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.