ETV Bharat / state

'తెరాస అభ్యర్థికి జిల్లాపై కనీస అవగాహన లేదు'

author img

By

Published : Mar 30, 2019, 11:15 AM IST

Updated : Mar 30, 2019, 11:24 AM IST

పొన్నం ప్రభాకర్​

కరీంనగర్​ ప్రజలు ఎన్నికల్లో ఆలోచించి ఓటెయ్యాలని కాంగ్రెస్​ పార్లమెంట్​ అభ్యర్థి పొన్నం ప్రభాకర్​ సూచించారు. తెరాస ఎంపీ అభ్యర్థి వినోద్​కుమార్​కు మంత్రి పదవి ఇస్తానన్న కేటీఆర్​ ఏ పార్టీ తరఫున ఇస్తారో చెప్పాలని ప్రశ్నించారు.

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​పై కరీంనగర్​ కాంగ్రెస్​ పార్లమెంటు అభ్యర్థి పొన్నం ప్రభాకర్​ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని కరీంనగర్​లో హెచ్చరించారు. తెరాస అభ్యర్థి వినోద్​కుమార్​ స్థానికేతరుడని... ఆయనకు జిల్లా సమస్యలపై అవగాహన లేదని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్​ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధి కోసం తనను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

కేటీఆర్​పై విమర్శలు చేస్తున్న పొన్నం

ఇదీ చదవండి :కాంగ్రెస్​ న్యాయ్​ హామీకి మూలం మోదీ: రాహుల్​

Last Updated :Mar 30, 2019, 11:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.