ETV Bharat / state

'మత్స్యకారులు జీవితాల్లో వెలుగు నింపుతున్న ఏకైక సర్కార్.. తెలంగాణ'

author img

By

Published : Oct 1, 2020, 4:30 PM IST

మత్స్యకారుల కుటుంబంలో వెలుగు నింపేందుకే తెలంగాణ సర్కార్ ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తోందని మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ శంకర్ రాఠోడ్ అన్నారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్​ జలాశయంలో చేపపిల్లలను వదిలారు.

nizam sagar dam in kamareddy district
నిజాంసాగర్ జలాశయం

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని నిజాంసాగర్ జలాశయంలో మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ శంకర్ రాఠోడ్ చేపపిల్లలను వదిలారు. జలాశయంలో 13 లక్షల 50వేల చేపపిల్లల్ని వదిలినట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ఉచిత చేపపిల్లలను అందిస్తోందని శంకర్ రాఠోడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య అధికారిణి పూర్ణిమ, స్థానిక ప్రజాప్రతినిధులు, మత్స్యకారులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.